*✨ ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు*
★ ఆంధ్రప్రదేశ్లో ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష-2020 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.
★ ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేశారు.
★ ఈ ఫలితాల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో *ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులే* నిలిచారు.
★ ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో టెన్త్ సిలబస్ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు.
★ 85,755 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.
★ *జనవరి 4 నుంచి కౌన్సిలింగ్* నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు తెలిపారు.
★ ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్లైన్ ప్రాసెస్ ఏర్పాటు చేశామన్నారు.
విద్య వ్యాపారం కాకూడదనే ఆన్లైన్ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి..
★ మౌలిక వసతులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
★ ఫలితాల కోసం క్రింద డైరెక్ట్ లింక్ ని ఉపయోగించండి.
PLEASE GIVE YOUR VALUABLE SUGGESTION AND COMMENT